లక్నో : విద్యార్ధినులను సొంత బిడ్డల్లా చూస్తూ వారికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన స్కూల్ ప్రిన్సిపల్ (Uttar Pradesh) వక్రబుద్ధితో వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చీటికి మాటికి తన గదికి పిలిపించుకుని వారిని అసభ్యంగా తాకుతుండటంతో చిన్నారులు భీతిల్లారు. ధైర్యం కూడదీసుకుని తల్లితండ్రులకు విషయం చేరవేయడంతో ప్రిన్సిపల్ అకృత్యాలు వెలుగుచూశాయి.
యూపీలోని ఘజియాబాద్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజీవ్ పాండేపై ఏడవ తరగతి నుంచి పదోతరగతి చదివే విద్యార్ధినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. బాలికల ఆరోపణలపై ప్రిన్సిపల్ పాండేను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ప్రిన్సిపల్పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రక్తంతో విద్యార్ధినులు యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్కు లేఖ రాశారు.
విషయం తెలిసిన విద్యార్ధినుల తల్లితండ్రులు స్కూల్కు వచ్చి ప్రిన్సిపల్ను నిలదీశారు. విద్యార్ధినులతో పాటు తల్లితండ్రులపై దురుసుగా ప్రవర్తించిన ప్రిన్సిపల్కు తల్లితండ్రులు దేహశుద్ధి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక విద్యార్ధినుల తల్లితండ్రులు తనతో పాటు పాఠశాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించారని ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read More :