న్యూఢిల్లీ: తీహార్ జైలు(Tihar Jail)లో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా చేస్తున్న దీపక్ శర్మ మోస పోయాడు. స్వయంగా బాడీబిల్డర్(Bodybuilder) అయిన ఆయన వ్యాపారం కోసం.. ఓ మహిళకు 50 లక్షలు ఇచ్చాడు. అయితే ఆ మహిళ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. రెజ్లర్ రౌనాక్ గులియాతో పాటు ఆమె భర్త అంకిత్ గులియా వ్యాపారం పేరుతో 50 లక్షలు మోసం చేసినట్లు ఆరోపించారు. హెల్త్ ప్రోడక్ట్ బిజినెస్ పేరుతో ఆ జంట మోసం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
డిస్కవరీ ఛానల్లో రెజ్లర్ రౌనక్ గులియా రియాల్టీ షో నిర్వహించేది. తన భర్త కూడా రెజ్లర్ అని, ఆయన హెల్త్ ప్రోడక్ట్ వ్యాపారవేత్త అని, తాము ఓ పెట్టుబడిదారుడి కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారన్నారు. అయితే గులియా వ్యాపారంలో 50 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు దీపక్ శర్మ తెలిపారు. భారీ లాభాలు వస్తాయని హామీ ఇచ్చారని, కానీ ఆ తర్వాత తన డబ్బు తిరిగి ఇవ్వలేకపోయారన్నారు.
తీహార్ జైలులో పనిచేస్తున్న ఆ అధికారి.. వెస్ట్ వినోద్ నగర్లో నివసిస్తున్నాడు. ఈస్ట్ ఢిల్లీలోని మధు విహార్ పోలీసు స్టేషన్లో ఆయన ఫిర్యాదును నమోదు చేశారు. చీటింగ్ కేసును రిజిస్టర్ చేశారు. ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. ఆ జంట కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
దీపక్ శర్మతో పాటు రెజ్లర్ గులియాకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తీహార్ జైలు అధికారి ఓ ఫిట్నెస్ గురుగా చాలా ఫేమస్. మరో వైపు గులియాకు ఇన్స్టాలో 4.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.