శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. అనంత్నాగ్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ హైబ్రీడ్ టెర్రరిస్టు హతమయ్యాడు. అనంత్నాగ్ జిల్లాలోని బిజ్బేహార్ ప్రాంతంలో రహస్య స్థావరాలను గుర్తించడానికి భద్రత దళాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. ప్రతిగా జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ హైబ్రిడ్ టెర్రరిస్ట్ చనిపోయాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
మృతుడిని సజ్జాన్ తంత్రేగా గుర్తించారు. అతడు లష్కరే తొయిబా ఉగ్రవాది అని, నవంబర్ 13న బిబ్ బెహారాలోని రఖ్మోమెన్లో స్థానికేతర కూలీ హత్యకేసులో అతని ప్రమేయం ఉందని చెప్పారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు.
UPDATE |When search party reached towards suspected hideout, terrorists opened fire which hit hybrid terrorist of LeT Sajjad Tantray of Kulgam, who was with search party for identification of hideout. He was rushed to hospital where doctors declared him brought dead: J&K Police
— ANI (@ANI) November 20, 2022