గువాహటి: సైకిల్పై వెళ్తున్న వ్యక్తిపై చిరుత పులి దాడి చేసింది. అయితే అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి ఏమీ కాలేదు. అస్సాంలోని కజిరంగా పార్క్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. అక్కడి జాతీయ రహదారి 37పై ఒక వ్యక్తి సైకిల్పై వెళ్తున్నాడు. అయితే ఆ రహదారి పక్కగా ఉన్న చెట్ల వద్ద మాటువేసిన చిరుత పులి ఒక్కసారిగా ఆ సైక్లిస్ట్పై దాడి చేసింది. దీంతో సైకిల్పై పట్టుకోల్పోయిన ఆ వ్యక్తి కిందపడ్డాడు. ఈ సంఘటనతో ఆ చిరుత కూడా భయపడి చెట్లలోకి పరుగు తీసింది.
కాగా, చిరుత దాడితో షాక్కు గురైన ఆ వ్యక్తి వెంటనే కింద పడిన సైకిల్ను పైకి తీశాడు. రోడ్డుకు మరో పక్కగా సైకిల్ తొక్కుతూ అక్కడి నుంచి వెనక్కి వచ్చాడు. సైకిళ్లతో పాటు ఉన్న మరో ఇద్దరి వద్దకు చేరుకున్నాడు. చిరుత దాడిలో తనకు ఏమైనా గాయం అయ్యిందా అని పదే పదే చూసుకున్నాడు.
మరోవైపు గతంలో జరిగిన ఈ సంఘటనకు చెందిన పాత వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్లో బుధవారం పోస్ట్ చేశారు. డెహ్రాడూన్-రిషికేశ్ హైవేపై ఈ సంఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ఇద్దరూ (చిరుత, సైక్లిస్ట్) అదృష్టవంతులని చమత్కరించారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా భిన్నంగా, ఫన్నీగా స్పందించారు.
On Dehradun-Rishikesh Highway….
Both are lucky ☺️☺️ pic.twitter.com/NNyE4ssP19— Susanta Nanda IFS (@susantananda3) September 21, 2022