ముంబై: నివాస ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నది. అది ఇప్పటికే ముగ్గురిపై దాడి చేసింది. దీంతో ఆ ప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబై సమీపంలో ఈ సంఘటన జరిగింది. కళ్యాణ్ ప్రాంతంలోని నివాసిత బిల్డింగ్లలో చిరుత పులి తిరుగుతున్నది. చించ్పాడలోని నవరంగ్ సొసైటీ బిల్డింగ్ మొదటి అంతస్తులో చిరుతను చూసి అక్కడి నివాసితులు భయాందోళన చెందారు. సహాయం కోసం వారు కేకలు వేశారు. కాగా, కొందరు హెచ్చరించినప్పటికీ పట్టించుకోకుండా ఒక వ్యక్తి ఆ భవనంలోకి వెళ్లాడు. దీంతో అతడిపై ఆ చిరుత దాడి చేసింది. స్థానికులు కొందరు కర్రలతో దానిని తరిమారు. దీంతో ఆ చిరుత పక్కనే ఉన్న మరో బిల్డింగ్లోకి దూకింది. దీంతో ఆ భవనంలోని నివాసితులు భయాందోళన చెందుతున్నారు. ఆ చిరుత ఇప్పటి వరకు ముగ్గురిపై దాడి చేసింది.
కాగా, ఆ చిరుత మలంగ్ఘర్ అటవీ ప్రాంతం నుంచి సమీప నివాసిత ప్రాంతానికి వచ్చింది. గురువారం ఉదయం 8.30 గంటలకు తొలుత ఆ చిరుతను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నివాసిత భవనాల్లో తిరుగుతున్న చిరుతపులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక బిల్డింగ్లోకి చిరుత దూకిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Leopard spotted inside an old building in Chinchpada, Kalyan @MahaForest @ThaneCityPolice @MumbaiPolice #leopard #deforestation pic.twitter.com/XzDG5sSlvd
— MIDIGTZART (@midhunnair18) November 24, 2022