లక్నో, మార్చి 3: యూపీలో పేపర్ల లీకేజీ ఓ అభ్యర్థిని ప్రాణం తీసింది. యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షకు సిద్ధమవుతున్న 22 ఏండ్ల వర్ష మనస్తాపంతో ఫిరోజాబాద్లో శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంతో కష్టపడి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా కానిస్టేబుల్, ఆర్వో/ఏఆర్ఓ పరీక్షల పేపర్లు లీకయ్యాయన్న బాధతో వర్ష ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ప్రభుత్వ ఉద్యోగం పొందడంతో వైఫల్యాల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్ ఇంటర్ బోర్డు పరీక్ష పేపర్ల లీక్ కేసులో ప్రధాన అనుమానితుడు వినయ్ చౌదరిని ఆగ్రా పోలీసులు అరెస్ట్ చేశారు.