న్యూఢిల్లీ, మే 25: ప్రముఖ చిప్ల తయారీ సంస్థ సైయెంట్ సెమికండక్టర్ మరోసారి నిధులను సమీకరించింది. ఎడల్వైస్ నుంచి 30 మిలియన్ డాలర్లు లేదా రూ.286 కోట్ల నిధులను సేకరించినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. అంతర్జాతీయంగా చిప్ల వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ నిధులను సేకరించినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
వీటిలో 10 మిలియన్ డాలర్లు ఈక్విటీ పెట్టుబడులు కాగా, 20 మిలియన్ డాలర్ల నిధులు డెబిట్గా తీసుకున్నది.