చెన్నై : తమిళనాడులోని తిరుచ్చి భీమ్నగర్లో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న న్యాయవాది గోపి కన్నన్పై గుర్తు తెలియని దుండగులు వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. కుమార్తె కళ్ల ముందే న్యాయవాదిని అత్యంత దారుణంగా పొడిచి చంపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో హత్య ఘటన దృశ్యాలు నమోదు అయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు దాడి చేసిన సమయంలో గోపి కన్నన్ తన కూతురికి సైకిల్ నేర్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.