న్యూఢిల్లీ : ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై లా కమిషన్ నివేదికలో స్వలింగ పెండ్లిండ్లకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలుస్తున్నది. కేవలం స్త్రీ, పురుషుల మధ్య వివాహాలకే గుర్తింపు ఇస్తున్నట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా అన్ని మతాల వారికీ పెండ్లి, విడాకులు, వారసత్వం, దత్తతలకు సంబంధించి ఒకే విధమైన చట్టాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వేర్వేరు మతాలవారికి ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యక్తిగత చట్టాలను రద్దు చేసి, యూసీసీని అమలు చేయాలని ప్రయత్నిస్తున్నది.