కజలాంగ్: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు డ్యాన్స్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ టూర్లో ఉన్న ఆయన స్థానిక గ్రామస్థులతో కలిసి సాంప్రదాయ స్టెప్పులేశారు. ఆ వీడియోను ఆయన కూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కజలాంగ్ గ్రామానికి చెందిన సాజోలాంగ్ తెగ ప్రజలతో కలిసి మంత్రి రిజిజు డ్యాన్స్ చేశారు. సాజోలాంగ్ తెగ ప్రజల్ని మిజీలని కూడా అంటారు. షర్ట్, ట్రౌజర్స్, స్నీకర్స్ వేసుకున్న రిజిజు.. స్థానిక గ్రామస్థులతో ఎంజాయ్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో తెగలు ఇలా సాంప్రదాయ నృత్యాలను ఎంజాయ్ చేస్తుంటారని, వారితో కలిసి డ్యాన్స్ చేసినట్లు రిజిజు తెలిపారు.
రిజిజు డ్యాన్స్పై ప్రధాని మోదీ కామెంట్ చేశారు. మా న్యాయశాఖ మంత్రి రిజిజు మంచి డ్యాన్సర్ అంటూ తన ట్విట్టర్లో మోదీ ఓ పోస్టు చేశారు. వైభవమైన అరుణాచల్ ప్రదేశ్ సంస్కృతిని చూడడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు.