చెన్నై : సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్తో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ బుధవారం మధ్యాహ్నం తమిళనాడులోని కోయంబత్తూరు – కూనూరు మధ్య కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న ఆర్మీ బలగాలు మంటలను అదుపు చేశాయి. రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రెండు మృతదేహాలను మాత్రమే బయటకు వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్లో మొత్తం 9 మంది ఉన్నట్లు సమాచారం.