Himachal Pradesh | ఉత్తరాదిని వరదలు ముంచెత్తాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తర భారతదేశంలోని ప్రధాన నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ప్రదేశ్లోని బియాస్ నది ఉప్పొంగి ప్రవహించింది. మనాలి వద్ద ఆ నది ఉధృతిని మాటల్లో చెప్పలేం. నదీ ప్రవాహానికి రోడ్డు పక్కన పార్క్ చేసిన టూరిస్టుల కార్లు చాలా వరకు కొట్టుకుపోయాయి. ఇది రెండు రోజుల కిందటి మాట. ఇప్పుడు బియాస్ నది శాంతించింది. వరద నీరు మొత్తం కిందకు పోవడంతో ఎప్పటిలా మారిపోయింది. నది మధ్యలో చిన్నపాయలా మాత్రమే నీరు ప్రవహిస్తుంది. దీనికి సంబంధించిన తాజా డ్రోన్ విజువల్స్ ఇవాళ విడుదలయ్యాయి.
ఆ డ్రోన్ విజువల్స్ చూస్తుంటే బియాస్ నది వరదలు మనాలిలో ఎంతటి వినాశనాన్ని సృష్టించాయో స్పష్టమవుతోంది. వరదల కారణంగా సగం వరకు నాశనమైన రోడ్లు.. నీటిలో కొట్టుకొచ్చిన పెద్ద పెద్ద బండరాళ్లు.. శిథిలమైన కట్టడాలు మనకు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ డ్రోన్ విజువల్స్ను మీరు ఓసారి లుక్కేయండి..
#WATCH | Early morning Drone visuals from Himachal Pradesh’s Manali pic.twitter.com/TBIvyqSymn
— ANI (@ANI) July 14, 2023