ముంబై: గాన కోకిల లతా మంగేష్కర్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆమె పార్థివ దేహాన్ని దవాఖాన నుంచి ఇంటికి తరలించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు శివాజీ పార్క్ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
లతా మంగేష్కర్ కన్నుమూతతో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. గౌరవ సూచకంగా రెండు రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయాలని సూచించింది.