న్యూఢిల్లీ, మార్చి 10: ‘ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం’ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సోదాలు జరిపింది. ఆర్జేడీ అధినేత, రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వీ యాదవ్, వారి సన్నిహితుల ఇండ్లలో, కార్యాలయాల్లో ఈ సోదాలు జరిగాయి.
ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధి, బీహార్లో మొత్తం 15కు పైగా ప్రాంతాల్లో అధికారులు సోదాలు జరిపారు. ఈ కేసులో ఇప్పటికే లాలూ ప్రసాద్ను సీబీఐ విచారించిన విషయం తెలిసిందే. లాలూ రైల్వే మంత్రిగా పనిచేసినప్పుడు ఉద్యోగాలు ఇపిస్తానని చెప్పి ఆశావహుల నుంచి భూమిని లంచంగా తీసుకున్నట్టు సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి.