Lalu Prasad Yadavs | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ విషయాన్ని ఆయన చిన్న కుమారుడు, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రోహిణి కిడ్నీని.. వైద్యులు లాలూకు విజయవంతంగా అమర్చినట్లు చెప్పారు. ప్రస్తుతం రోహిణి, లాలూ ఇద్దరూ ఐసీయూలో ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. లాలూ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు లాలూ ఆసుపత్రిలో ఉన్న వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు.
पापा का किडनी ट्रांसप्लांट ऑपरेशन सफलतापूर्वक होने के बाद उन्हें ऑपरेशन थियेटर से आईसीयू में शिफ्ट किया गया।
डोनर बड़ी बहन रोहिणी आचार्य और राष्ट्रीय अध्यक्ष जी दोनों स्वस्थ है। आपकी प्रार्थनाओं और दुआओं के लिए साधुवाद। 🙏🙏 pic.twitter.com/JR4f3XRCn2
— Tejashwi Yadav (@yadavtejashwi) December 5, 2022
అంతకు ముందు లాలూ పెద్ద కుమార్తె, ఎంపీ మిసా భారతి సైతం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ‘రోహిణి కిడ్నీని వైద్యులు విజయవంతంగా తొలగించారు. రోహిణి ఐసీయూలో ఆరోగ్యంగా ఉంది. ప్రస్తుతం నాన్నకు ఆపరేషన్ జరుగుతోంది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు రోహిణి ఆసుపత్రి బెడ్పై ఉన్న ఫొటోలను పంచుకున్నారు.
छोटी बहन रोहिणी का डोनर का ऑपरेशन सफलतापूर्वक हो गया है। वह पूरी तरह से स्वस्थ अभी ICU में हैं।
अभी पापा का ऑपरेशन चल रहा है। pic.twitter.com/xXn0QV8E2K— Dr. Misa Bharti (@MisaBharti) December 5, 2022
లాలూ ప్రసాద్ యాదవ్ కొన్నేళ్లుగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సింగపూర్ వెళ్లిన లాలూ.. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. లాలూని పరీక్షించిన సింగపూర్ వైద్యులు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు కిడ్నీ దానం చేసేందుకు సింగపూర్లో ఉంటున్న ఆయన చిన్న కుమార్తె రోహిణి ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
आप सब की शुभकामनाओं के लिए कोटि कोटि आभार! pic.twitter.com/z1spCT2qSB
— Dr. Misa Bharti (@MisaBharti) December 5, 2022