న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి, మరో 14 మందికి ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది.
సీబీఐ సోమవారం దాఖలు చేసిన చార్జిషీటు ప్రకారం వీరు మార్చి 15న విచారణకు హాజరు కావాలని ప్రత్యేక జడ్జి గీతాంజలి గోయల్ సమన్లు జారీ చేశారు.