రాంచీ, ఏప్రిల్ 22: దాణా కుంభకోణానికి సంబంధించిన డోరండా ట్రెజరీ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్ను సవాల్ చేస్తూ సీబీఐ చేసిన వాదనలను జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తిరస్కరించారు.
ఈ కేసులో లాలూ ఇప్పటికే సగానికి పైగా జైలు జీవితం గడిపారని, 41 నెలలు జైల్లో ఉన్నారని లాలూ తరపు న్యాయవాది ప్రభాత్కుమార్ కోర్టుకు తెలిపారు. రూ.139 కోట్ల డోరండాట్రెజరీ అక్రమాల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో లాలూకు ఐదేండ్ల జైలుశిక్ష విధించింది.