ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మెళ్లి మెళ్లిగా యాక్టివ్ అవుతున్నారు. అనారోగ్య కారణాల రీత్యా ఆయన కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. తాజాగా… మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా కర్నాటకలో జరుగుతున్న హిజబ్ వివాదంపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. దేశం అంతర్యుద్ధం దిశగా సాగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరో వైపు కర్నాటకలో హిజబ్ వివాదం కొనసాగుతూనే వుంది. మాండ్యతో సహా మరో జిల్లాలో విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో ముఖ్యమంత్రి బొమ్మై స్పందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ శాంతియుతంగా ఉండాలని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు విద్యా సంస్థలన్నింటినీ మూసేస్తున్నట్లు సీఎం బొమ్మై ప్రకటించారు.