ముంబై: ముంబైలోని ప్రముఖ లాల్బగ్చా (lalbaugcha) రాజా సార్వజనిక్ గణేశ్ ఉత్సవ మండలికి బృహిన్ ముంబై నగర పాలక సంస్థ భారీ జరిమాన విధించింది. గణేశ్ నవరాత్రుల సందర్భంగా రోడ్డును ధ్వంసం చేశారని, దానికిగాను రూ.3.66 లక్షలు చెల్లించాలని నిర్వాహకులకు జరిమానా విధించింది. ఉత్సవాల సందర్భంగా ముంబైలోని డాక్టర్ బాబాసాహెచ్ రోడ్డు, టీబీ కదమ్ మార్గ్లో రోడ్డు ధ్వంసమయిందని పేర్కొన్నది. ఈ మార్గంలో మొత్తం 183 గుంతలు (పాట్హోల్) ఏర్పడ్డాయని బీఎంసీ తెలిపింది. ఒక్కో పాట్హోల్కు రూ.2 వేల చొప్పున చెల్లించాలని స్పష్టం చేసింది.
ముంబైలో గణేశ్ ఉత్సవాలు అనగానే లాల్బగ్చా రాజా వినాయకుడు గుర్తొస్తాడు. నిర్వాహకులు ఏటా భారీ గణనాథుడిని ప్రతిష్టించడంతోపాటు ఉత్సవాలను ఘనంగా చేస్తారు. లాల్బగ్చా గణేశుడిని దర్శించుకోవడానికి బాలీవుడ్ నటులు, రాజకీయ నాయులు పోటీపడుతుంటారు.