న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో చెలరేగిన హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన స్టేటస్ రిపోర్ట్పై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. సాక్షులను విచారించామని చెప్పడం తప్ప.. రిపోర్టులో ఏమీ లేదని పేర్కొన్నది. హింసాకాండకు సంబంధించి 13 అరెస్టు చేయగా.. ఆశిష్ మిశ్రా ఫోన్ను జప్తు చేయడంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిందితుల ఫోన్ కాల్ వివరాలు ఇవ్వాలని, పోలీసులు సేకరించిన ఆధారాలు కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.
ఇతర కేసుల సాక్ష్యాలను ఈ కేసును ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసేందుకు నిరాకరించింది. అలాగే లఖింపూర్ కేసులో ల్యాబ్ నివేదిక సమర్పించకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి స్పందించిన ప్రభుత్వం నవంబర్ 15న రిపోర్ట్ వస్తుందని చెప్పగా.. కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ఆదేశించింది. హింసాత్మక ఘటన విచారణ తాము ఆశించిన మేరకు దర్యాప్తు జరుగడం పేర్కొంది. హైకోర్టు మాజీ న్యాయమూర్తుల పర్యవేక్షణలో మొత్తం కేసును విచారించాలని కోర్టు సూచించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తులు రంజిత్ సింగ్, రాకేశ్ కుమార్ జైన్లను నియమించింది.