న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ హింస కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయ ప్రయోజనాల కోసం బెయిల్ రద్దు చేయాలంటూ న్యాయవాదులు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా పిటిషన్లు దాఖలు చేశారు. నిందితుడు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని వారు ఆరోపించారు. అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా ఆశిష్ మిశ్రా గత మంగళవారం జైలు నుంచి విడుదలయ్యాయి. గతేడాది అక్టోబర్ 3న జరిగిన హింసాత్మక ఘటనలో రైతులు సహా ఎనిమిది మృతి చెందిన విషయం తెలిసిందే.