న్యూఢిల్లీ, మార్చి 17: ఈ ఏడాది ప్రపంచంలో దర్శించాల్సిన ముఖ్యమైన 50 ప్రదేశాల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. అందులో భారత్కు చెందిన రెండు దర్శనీయ ప్రదేశాలకు చోటు కల్పించింది. అందులో ఒకటి ఒడిశాలోని మయూర్భంజ్ కాగా, రెండోది లఢక్. మయూర్భంజ్ జిల్లా అందమైన పచ్చిక బయళ్లతో సాంస్కృతిక వారసత్వ సంపదకు పెట్టింది పేరు. అత్యంత అరుదైన బ్లాక్ టైగర్ను దేశంలో ఇక్కడ మాత్రమే మనం ప్రత్యక్షంగా చూడగలం. ఇక లఢక్ గురించి తెలుసుకోవాలంటే అరుణాచల్ ప్రదేశ్కు సమీపంలో బోర్డర్కు దగ్గరగా ఉండే ఈ ప్రాంతంలోని లేహ్ చూడచక్కని దర్శనీయ స్థలం. సముద్రమట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఈ ప్రధాన నగరం ఉంటుంది. మరో టిబెట్గా పేర్కొనే లఢక్ ఎత్తయిన పర్వత శ్రేణులు, మంచుతో నిండి ఉంటుంది.