న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత లా గణేశన్ మణిపూర్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు. తమిళనాడులోని తంజావూరుకు చెందిన గణేశన్ ప్రస్తుతం బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా పనిచేస్తున్నారు. మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఈనెల 20న పదవీ విరమణ పొందారు. ఆమె స్థానంలో లా గణేశన్ నియమితులయ్యారు. యాదృచ్చికంగా.. ఎంపీగా కూడా నజ్మా హెప్తుల్లా స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. హెప్తుల్లా స్థానంలో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎంపికయ్యారు.
హెప్తుల్లా 2016 ఆగస్టులో మణిపూర్ గవర్నర్గా నియమితులయ్యారు. అయితే అనారోగ్య కారణాలతో ఆమె గత కొంతకాలంగా విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో సిక్కిం గవర్నర్కు మణిపూర్ గవర్నర్గా అధనపు బాధ్యతలు అప్పగించారు.