న్యూఢిల్లీ, ఆగస్టు 7: భగవద్గీత బోధనలకు అనుగుణంగా ఆసియాలోనే తొలి, అతిఎత్తైన దేవాలయాన్ని హరియాణాలోని కురుక్షేత్రలో నిర్మిస్తున్నారు. 260 అడుగుల ఎత్తుతో 18 అంతస్తులను బ్రహ్మ సరోవర్ నది ఒడ్డున జ్ఞాన్ మందిర్ పేరిట నిర్మాణం చేపట్టారు. ఈ దేవాలయాన్ని మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. శ్రీ బ్రహ్మపురి అన్నక్షేత్ర ఆశ్రమ ట్రస్టు నిర్వాహకులు దేవాలయ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. కురుక్షేత్ర అభివృద్ధి బోర్డు ఈ భూమిని విరాళంగా ఇచ్చింది.