న్యూఢిల్లీ : బీజేపీ నేత బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరిన క్రమంలో పెద్దసంఖ్యలో కాషాయ పార్టీ నేతలు తమ పార్టీలోకి వచ్చేందుకు టచ్లో ఉన్నారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ పేర్కొన్నారు. బీజేపీలో అసంతృప్తితో రగులుతున్న పలువురు నేతలు తమ పార్టీలో చేరేందుకు టీఎంసీ అధినాయత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు.
ఒకరు (బాబూలాల్ సుప్రియో) ఈరోజు పార్టీలో చేరారు..రేపు మరొకరు..ఇలా ఈ ప్రక్రియ కొనసాగుతుందని, మనం వేచిచూడాలని ఘోష్ అన్నారు. ఇటీవల మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణలో మంత్రిపదవి కోల్పోయిన సుప్రియో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.