హైదరాబాద్ : నటి కృతి సనన్ భారతీయ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కూ (Koo) లో చేరారు. ఆమె చేరిన వారంలోనే 20వేల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. @kritisanon అనే హ్యాండిల్ తో తన అభిమానులకు చేరువయ్యారు. రెండు వారాల క్రితం తన స్నేహితుడు, స్టార్ నటుడు టైగర్ ష్రాఫ్ భారతీయ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ లో చేరి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చి, వారి నుంచి ఘనమైన స్వాగతం పొందారు. కృతి చేరిన వెంటనే తన ఫ్యాన్ క్లబ్స్ అయిన @FAN-OF-KS, @Kriti_Sanon_FC, @krotsaffection, @team_kritian కూడా ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు.
కృతి సనన్ కూ లో తన ఫోటో తో తను చేరినట్టు ప్రకటించడంతో పాటు మిగతా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో కూడా షౌట్ ఔట్ ద్వారా కూ లో చేరినట్టు తన అభిమానులకు తెలిపారు. ఆమె షేర్ చేసిన ఫొటోకు 1700 కు పైగా లైక్స్ వచ్చాయి. కృతి ఇప్పుడు వివిధ భాషలలో తన అభిమానులతో కనెక్ట్ అవడానికి “కూ” ని ఉపయోగించనుంది. కృతి ఇప్పుడు ప్రభాస్ తో భారతీయ పౌరాణిక చిత్రం ఆదిపురుష్ లో నటిస్తున్నారు.