న్యూఢిల్లీ : దేశంలో కరోనా కోరలు చాస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో కరోనా కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. రోజు రోజుకి కేసులు పెరుగుతుండటంతో ఆయ రాష్ట్రాలు ఆంక్షల్ని కట్టుదిట్టం చేస్తున్నాయి. కాగా, దేశంలో కొత్తగా 2,68,833 కరోనా కేసులు నమోదయ్యాయి. 402 మంది మరణించారు. మహమ్మారి బారి నుంచి 1,22,684 మంది కోలుకున్నారు.
దేశంలో కరోనా పాజిటివిటి రేటు 16.66 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 14 లక్షలు దాటాయి. దేశంలో ఇప్పటి వరకు156.02 కోట్ల టీకా డోసులను ప్రభుత్వం పంపిణీ చేసింది. అలాగే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6.041 చేరింది. కాగా, థర్డ్వేవ్ మార్చి నెల మధ్యకాలానికి పూర్తిగా తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.