హైదరాబాద్: ప్రముఖ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ “కూ” యాప్, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, అవగాహన కార్యక్రమం కోసం చేతులు కలిపాయి. ఆన్లైన్ సేఫ్టీ, సెక్యూరిటీ , సైబర్ భద్రతపై ప్రజలకు అవగాహనను పెంపొందించడం,వినియోగదారులందరికీ ఇంటర్నెట్ను సురక్షితంగా అందించడం ఈ ప్రచార లక్ష్యం.
2022 థీమ్- ‘టుగెదర్ ఫర్ ఎ బెటర్ ఇంటర్నెట్”కూ” సహకారంతో యువతను బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా, సృజనాత్మకంగా ఉపయోగించుకునేలా.. తల్లిదండ్రులు సమాజం పోషించగల కీలక పాత్ర గురించి ఈ ప్రచారం ద్వారా వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
https://www.kooapp.com/koo/IndianCERT/a830f055-5616-4f6a-87ab-ddea5fd975c1
“కూ”ప్రతినిధి మాట్లాడుతూ “భారతీయులు స్థానిక భాషల్లో తమను తాము ఆన్లైన్లో వ్యక్తీకరించడానికి వీలు కల్పించే బహుళ-భాషా వేదికగా, ఇంటర్నెట్ భద్రత, బాధ్యతాయుతమైన వినియోగదారు ప్రవర్తనను ప్రోత్సహించడంలో “కూ”ముందంజలో ఉందని అన్నారు. ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి, ఆరోగ్యకరమైన కంటెంట్ను రూపొందించడానికి , అర్థవంతమైన సంభాషణలను నిర్వహించడానికి వినియోగదారులను ప్రోత్సహించడానికి మేము బలమైన విధానాలను కలిగి ఉన్నామని ఆయన తెలిపారు.