కోల్కతా, మార్చి 5: కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ చెప్పినట్టుగానే తన పదవి నుంచి వైదొలిగారు. ప్రత్యక్ష రా జకీయాల్లో చేరబోతున్నానని ఇటీవల ప్రకటించిన ఆయన మంగళవారం త న పదవికి రాజీనామా చేశారు. ఆ త ర్వాత కొద్ది గంటలకే బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అవినీతికి పర్యా యపదంగా మారిందని, ఆ పార్టీపై కడదాకా పోరాడుతానని విలేకర్ల స మావేశంలో స్పష్టం చేశారు.
కోల్కతా హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గంగోపాధ్యాయ్ విద్యా రంగానికి సంబంధించిన వివిధ కేసుల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడం రాజకీయ చర్చకు తెరలేపింది. టీఎంసీ నేతలు తనను రెచ్చగొడుతున్నారని, అందుకే రాజకీయాల్లోకి వచ్చాన న్నారు.