Technical Snag in Indigo Flight | కోల్కతాకు వెళ్లాల్సిన ఓ విమానం శనివారం సాంకేతిక లోపంతో జార్ఖండ్ రాజధాని రాంచీలో టేకాఫ్ అయిన వెంటనే నేలకు పరిమితమైంది. ఈ ఘటన శనివారం ఉదయం 9 గంటలకు చోటు చేసుకుంది. 72 సీట్లు గల ఇండిగో విమానంలో 62 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఉదయం తొమ్మిది గంటలకు టేకాఫ్ తీసుకోగానే సాంకేతిక లోపం తలెత్తింది. విమానంలోని ఎయిర్ కండీషనర్లో లోపం తలెత్తడంతో ఆ విమానం పని చేయడం నిలిచిపోయింది.
దీంతో మరమ్మత్తు పనుల కోసం నేలకు పరిమితం అయిందని రాంచీ విమానాశ్రయం డైరెక్టర్ వినోద్ శర్మ పీటీఐకి చెప్పారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.