ఇండోర్: అయోధ్య రాముడి దర్శనం కోసం వెళ్తూ ఓ విద్యార్థి మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో 21 ఏళ్ల దేవాన్ష్ జోషి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఫిబ్రవరి 28వ తేదీన ఆ ప్రమాదం జరిగింది. ఇండోర్ ఆస్పత్రిలో ఆ విద్యార్థిని చేర్పించగా, అతను బ్రెయిన్డెడ్ అని డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఆ విద్యార్థి ఫ్యామిలీ అనుమతి తీసుకున్న తర్వాత.. అతని లివర్, కిడ్నీని ఇద్దరు పేషెంట్లకు అమర్చారు(Organ Transplantation). విజయవంతంగా అవయవ మార్పిడి చేసినట్లు మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ సంజయ్ దీక్షిత్ తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన విద్యార్థి జోషి ఒక కిడ్నీతో పుట్టాడు. అయితే గుండె మార్పిడి చేద్దామనుకుంటే, అతని గుండె సరిగా లేదని డాక్టర్లు గుర్తించారు.