న్యూఢిల్లీ: ‘నాన్నా.. రాఖీ పండుగ వస్తున్నది.. నేను రాఖీ కట్టడానికి తమ్ముడు కావాలి’ అంటూ కుమార్తె కోరిన కోర్కెను తీర్చడానికి ఒక తండ్రి భార్యతో కలిసి ఏకంగా ఒక చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన ఢిల్లీలో చేటుచేసుకుంది. రఘుబీర్నగర్లో నివసించే సంజయ్ గుప్తా (41), అనిత గుప్తా (36)లకు కుమారుడు, కుమార్తె సంతానం.
వారి కుమారుడు గత ఏడాది మరణించాడు. అయితే రాఖీ పండుగ దగ్గరకు వస్తున్నందున తాను రాఖీ కట్టడానికి సోదరుడిని తేవాలంటూ వారి 15 ఏండ్ల కుమార్తె తల్లిదండ్రులను అడిగింది. ఆమె కోరిక తీర్చడానికి వారు పసికందును అపహరించారు.