ఇండోర్, ఆగస్టు 14: రాష్ట్రంలోని బీజేపీ నేతల సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావుకు ఉన్న ప్రజాదరణ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఉన్న మెజారిటీని ఇతర రాష్ర్టాల బీజేపీ నేతలు ఒప్పుకోక తప్పడం లేదు. విపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీశ్ పేరు తరచుగా వినబడుతుండటంపై బీహార్కు చెందిన బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ స్పందించారు. విపక్షాల తరుఫు ప్రధాని అభ్యర్థి రేసులో కేసీఆర్ వంటి ప్రజాదరణ కలిగిన నేతలూ ఉన్నారని చెప్పారు. కేసీఆర్ ఓ బలమైన నేత అని, ఆయనకు అచంచలమైన ప్రజాదరణ ఉన్నదని పొగడ్తలతో ముంచెత్తారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కూడా బలమైన నేతలేనని తెలిపారు.