తిరువనంతపురం: కేరళలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు ( Corona in Kerala ) మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 9,361 మంది కరోనా మహమ్మారి బారిపడ్డారు. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 48,88,678కి పెరిగింది. కరోనా మరణాలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఇవాళ 99 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 27,765కు చేరింది.
ఇక ఇవాళ 9,401 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 47,88,629కి పెరిగింది. ప్రస్తుతం కరోనా మరణాలు, రికవరీలు పోను మరో 80,892 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ ఎర్నాకుళం జిల్లాలో అత్యధికంగా 1,552 మంది కరోనా బారినపడ్డారు. తిరువనంతపురం 1,214, కొల్లామ్ 1,214 ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి.