తిరువనంతపురం: కేరళలో కరోనా ( Corona in Kerala ) ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అక్కడ ఇప్పటికీ నాలుగు వేలకు తగ్గకుండా రోజువారీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 4,741 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉన్నది. గడిచిన 24 గంటల్లో కేరళలో 5,144 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు.
ఇక కరోనా మరణాలు కూడా క్రమం తప్పకుండా నమోదవుతూనే ఉన్నాయి. ఇవాళ 28 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 39,679కి పెరిగింది. కరోనా మరణాలు, రికవరీలు పోను కేరళలో ప్రస్తుతం 48,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి.