తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసులు 1.7 లక్షలకు పెరిగాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. కాగా, మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 21,427 కరోనా కేసులు, 179 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,45,457కు, మొత్తం మరణాల సంఖ్య 19,049కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 18,731 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 35,48,196కు చేరుకున్నదని పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్స్పాట్గా కేరళ కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో టెస్ట్ పాజిటివిటీ రేటు 15.5 శాతంగా ఉన్నది.