తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. యాక్టివ్ కేసుల సంఖ్య 1.4 లక్షలు దాటింది. గత నెలన్నర రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 17,466 కరోనా కేసులు, 66 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,71,530కు, మొత్తం మరణాల సంఖ్య 16,035కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 15,247 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 31,14,716కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,40,276 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్స్పాట్గా కేరళ కొనసాగుతున్నది.