తిరువనంతపురం: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్రమం తగ్గుతున్నది. ఒకప్పుడు నాలుగున్నర లక్షల స్థాయికి చేరిన రోజువారీ కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు 50 వేలకు దిగివచ్చింది. అయితే కేరళలో మాత్రం కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. అక్కడ ఇప్పటికీ 10 వేలకు తగ్గకుండా రోజువారీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 12,787 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
రోజువారీ కరోనా మరణాలు కూడా ప్రతిరోజూ 100కు తగ్గకుండా నమోదవుతున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 150 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా అందుకు తగ్గట్టుగానే రికవరీలు కూడా ఉన్నాయి. ఇవాళ కొత్తగా 13,683 మంది బాధితులు కరోనా మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,445కు చేరగా, రికవరీల సంఖ్య 27,29,967కు పెరిగింది.