తిరువనంతపురం: కేరళలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 12,456 కరోనా కేసులు, 135 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,61,584కు, మొత్తం మరణాల సంఖ్య 13,640కు పెరిగింది. కాగా గత 24 గంటల్లో 12,515 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 28,43,909కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,03,567 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు వెల్లడించింది.