తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ( Covid in Kerala ) ఇంకా చాలాకాలం ప్రభావం చూపేలా కనిపిస్తున్నది. ఎందుకంటే అక్కడ ఏనాడూ రోజువారీ కొత్త కేసుల సంఖ్య 15 వేలకు దిగిరావడం లేదు. గత కొంతకాలంగా 15 వేల నుంచి 35 వేల మధ్యనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇవాళ కూడా కేరళలో కొత్తగా 15,692 మందికి పాజిటివ్ వచ్చింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 45,24,185కు పెరిగింది.
ఇక ఇవాళ కొత్తగా 92 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 23,683కు చేరింది. ఇక ఇవాళ 22,223 మంది రికవరీ అయ్యారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 43,32,897కు పెరిగింది. కరోనా మరణాలు, రికవరీలు పోను ప్రస్తుతం కేరళలో 1,67,008 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళలో 14 రాష్ట్రాల్లో మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతున్నది.