తిరువనంతపురం: సంచలనం రేపిన భార్యల మార్పిడి కేసులోని (partner swapping case) ప్రధాన నిందితుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళలో ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది జనవరిలో జీవిత భాగస్వాముల మార్పిడికి పాల్పడుతున్న వైనాన్ని ఆ రాష్ట్ర పోలీసులు ఛేదించారు. బాధిత మహిళ ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్తతోపాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు. అయితే భార్యల మార్పిడిపై ఫిర్యాదు చేసిన 26 ఏళ్ల మహిళ ఈ నెల 19న హత్యకు గురైంది. తండ్రి ఇంట్లో ఉంటున్న ఆమె మృతదేహం సమీపంలో పడి ఉంది. ఆ సమయంలో ఆమె తండ్రి, సోదరుడు ఇంటి వద్ద లేరు. పిల్లలు బయట ఆడుకుంటున్న సమయంలో ఆ మహిళ హత్యకుగురైంది. రక్తం మడుగుల్లో పడి ఉన్న ఆమెను పిల్లలు తొలుత గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భర్త షినో మాథ్యూ ఆమెను హత్య చేసినట్లు ఆ మహిళ తండ్రి, కుటుంబ సభ్యులు ఆరోపించారు.
కాగా, ఆ మహిళ హత్యకు గురైన వారం తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితుడైన భర్త షినో మాథ్యూ విషం తాగాడు. తొలుత అతడ్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్గా ఉండటంతో ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న మాథ్యూ సోమవారం తెల్లవారుజామున మరణించాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు.