కొచ్చి , నవంబర్ 8: పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కోరుతూ దాఖలైన పిల్పై 10 రోజుల్లోగా స్పందించాలని జస్టిస్ మణికుమార్ నేతృత్వంలోని కేరళ హైకోర్టు ధర్మాసనం జీఎస్టీ కౌన్సిల్కు నోటీసులు జారీచేసింది. వాటిని జీఎస్టీ పరిధిలో ఎందుకు చేర్చలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ రెండు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధి బయటే కొనసాగించా లని సెప్టెంబర్ 17న జరిగిన కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే ఆదాయాలపై ప్రభావం పడుతుందని కౌన్సిల్ పేర్కొంది.