తిరువనంతపురం: దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. మహారాష్ట్ర తర్వాత ఆ రాష్ట్రంలోనే భారీ సంఖ్యలో జనాభా మహమ్మారి బారినపడుతున్నారు. అయితే కేరళలో నమోదవుతున్న వాటిలో 94 శాతం కేసులు ఒమిక్రాన్ రకానికి చెందినవేనని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ (Veena george) వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఒమిక్రాన్ వేవ్ నడుస్తున్నదని స్పష్టమైందని చెప్పారు.
కరోనా పాజిటివ్ నమూనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, అందులో 94 శాతం నమూనాలు ఒమిక్రాన్ పాజిటివ్ వస్తున్నాయని, మరో 6 శాతం డెల్టా వేరియంట్ రకానికి చెందినవని తెలిపారు. కరోనా బాధితుల్లో 4 శాతంకంటే తక్కువగానే దవాఖానల్లో చేరుతున్నారని, ఒక్క శాతంలోపు రోగులకే ఆక్సిజన్ అవసరమవుతుందన్నారు.
కేరళలో గురువారం 51,739 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 153 మంది మరణించారు. కాగా, దేశవ్యాప్తంగా 2.51 లక్షల కేసులు రికార్డయ్యాయి. ఇందులో 21,05,611 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.