తిరువనంతపురం, మార్చి 7: దేశంలోనే తొలిసారిగా కేరళ ప్రభుత్వం సొంతంగా ఓటీటీ ప్లాట్ఫాంను లాంచ్ చేసింది. దీని పేరు ‘సీస్పేస్’. కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కా ర్పొరేషన్ (కేఎస్ఎఫ్డీసీ) దీనిని ని ర్వహిస్తుంది. తిరువనంతపురంలో ని కైరాలీ థియేటర్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీనిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడు తూ పరిశ్రమకు ఎలాంటి ఇ బ్బంది లేకుండా కళాత్మక, సాం స్కృతిక విలువలతో కూడిన చిత్రాలకు ఇది ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. సీ స్పేస్ ఇంట్లోకి నాణ్యమైన చిత్రాల ను తీసుకొచ్చే మాధ్యమంగా ఉం టుందని వివరించారు. సీస్పేస్ ఇ ప్పటికే విడుదలైన సినిమాలను ప్ర సారం చేస్తుందని, కాబట్టి ప్రధాన ఫిల్మ్ ఇండస్ట్రీకి దీనివల్ల ఎలాంటి హాని ఉండదని పునరుద్ఘాటించారు. తొలి విడత స్ట్రీమింగ్ కోసం 42 సినిమాలను ఎంపిక చేశా రు. రెవెన్యూ షేర్, ఆదాయం, నిర్వహణలో పూర్తి పాదర్శకంగా ఉండే సీస్పేస్ను ‘పే పర్ వ్యూ’లో నిర్వహిస్తారు.