తిరువనంతపురం,జూలై:శివగిరి మఠమ్ మాజీ పీఠాధిపతి,శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్ట్ (ఎస్ఎన్డిఎస్టి) మాజీ అధ్యక్షుడు,స్వామి ప్రకాశానంద బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 99 ఏండ్లు. వయసురీత్యా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తిరువనంతపురం జిల్లా లోని శ్రీ నారాయణ మిషన్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు.
కొల్లం లోని పిరావంతూర్కు చెందిన ప్రకాశానంద 22 ఏండ్ల వయసులో శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్ట్ లో సన్యాసం స్వీకరించారు. ఆయన జీవితాన్ని శ్రీ నారాయణ ధర్మ సంఘానికి అంకితం చేశారు. ఆయన మరణం పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు.