తిరువనంతపురం: అదా శర్మ నటించిన ద కేరళ స్టోరీ(The Kerala Story) చిత్రం పెను సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వివాదాస్పద ఫిల్మ్ను ఇవాళ దూరదర్శన్లో టెలికాస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేరళ సీఎం విజయన్ దూరదర్శన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఆ చిత్రాన్ని ప్రసారం చేయడం వల్ల వర్గ హింసకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని, లోక్సభ ఎన్నికల వేళ ఇది సరైన నిర్ణయం కాదు అని విజయన్ పేర్కొన్నారు. ద కేరళ స్టోరీ చిత్రం టెలికాస్ట్ను నిలిపివేయాలని సీఎం విజయన్ దూరదర్శన్ను డిమాండ్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రచారం కోసం పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ ను వాడడం సరికాదు అని విజయన్ అన్నారు.