కేరళ: లౌకిక దేశమైన భారత్ను పథకం ప్రకారం మత రాజ్యంగా మలుస్తున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కరీపూర్లో జరిగిన 10వ ముజాహిద్ స్టేట్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానిపై పరోక్షంగా విమర్శలు చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు మతపరమైన వేడుకల్లో పూజారులుగా మారుతున్నారని విమర్శించారు. ఇందుకు ఉదాహరణగా ఇటీవల అయోధ్యలో జరిగిన శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పేర్కొన్నారు. కేంద్రంలోని పెద్దలు మత సంస్థలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న హద్దులను చెరిపేస్తున్నారని అన్నారు.