న్యూఢిల్లీ: రాబోయే లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై .. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ పోటీ పడనున్నారు. 2009 నుంచి వయనాడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తున్నది. 2019 జనరల్ ఎలక్షన్స్లో సురేంద్రన్ పాతానమిట్ట స్థానం నుంచి పోటీ చేశారు. 2016 ఎన్నికల్లో మంజేశ్వరం అసెంబ్లీ స్థానం నుంచి సురేంద్రన్ 89 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో జరిగిన బైపోల్స్ లో పోటి చేసి ఓటమి చెందారు. 2020లో కేరళ బీజేపీ చీఫ్గా నియమితుడయ్యారు. శబరిమలలో మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆందోళనలు చేపట్టారు. కేరళలోని తిరువనంతపురం తర్వాత వయనాడ్ స్థానం కీలకంగా మారింది. తిరువనంతపురంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎంపీ శశి థరూర్ మధ్య పోటీ జరగనున్నది.