సిరిసిల్ల రూరల్ : సిరిసిల్లలో రామ్ రాజ్ కాటన్ బ్రాండ్ పేరుతో నకిలీ మాస్కులను తయారు చేస్తున్న ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి రూ.5 లక్షల విలువైన మాస్క్లు, కంప్యూటర్, ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ ఉపేందర్ వివరాలను వెల్లడించారు. సిరిసిల్లలోని గీతనగర్కు చెందిన ఈగ బలరాం, సెస్ రోడ్లో గత కొన్నేళ్లుగా బలరాం క్లాత్ స్టోర్ దుకాణం నడిపిస్తున్నాడు.
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా మాస్కుల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని క్యాష్ చేసుకునే ఉద్దేశ్యంతో ఈ పనికి పాల్పడ్డట్లు తెలిపారు. కంపెనీ మాస్కుల అమ్మకాలు తగ్గడం, అతి తక్కువ ధరలో తమ కంపెనీకే చెందిన మాస్కులు పలు దుకాణాల్లో అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో నిర్వాహాకులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈగ బలరాం, ఉమా శంకర్ లను అరెస్టు చేశారు.