Punjab Polls : పంజాబ్లో తమ పార్టీ సీఎం అభ్యర్ధి పేరును ప్రకటిస్తానన్న 24 గంటల్లోపే ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. మూడు కోట్ల మంది పంజాబీలే ఆప్ సీఎం అభ్యర్ధిని ప్రతిపాదిస్తారని చెబుతూ దీనికోసం కేజ్రీవాల్ ఓ మొబైల్ నెంబర్ను ప్రారంభించారు.
ప్రజలు ఆప్ తరపున సీఎం అభ్యర్ధిగా ఎవరు ఉండాలనే దానిపై 7074870748 నెంబర్పై జనవరి 17, సాయంత్రం ఐదు గంటల్లోగా తమ అభిప్రాయాలు వెల్లడించవచ్చని పేర్కొన్నారు. పంజాబ్ ప్రజలు ఈ నెంబర్కు కాల్ చేయడం, మెసేజ్లు పంపడం, వాట్సాప్ ద్వారా సీఎం అభ్యర్ధిపై తమ ఫీడ్బ్యాక్ను అందించవచ్చని అన్నారు. ప్రజల ఓట్లతో సీఎం అభ్యర్ధిని గుర్తించే ప్రక్రియను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
మరోవైపు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆప్ పంజాబీలపై వరాలు గుప్పిస్తోంది. తాము అధికారంలోకి వస్తే 18 ఏండ్లు పైబడిన మహిళలకు నెలకు రూ 1000 నగదును అందిస్తామని, ఉచిత విద్య, వైద్యం, ఉచిత విద్యుత్ను అందుబాటులోకి తీసుకువస్తామని ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇప్పటికే పలు హామీలు గుప్పించారు.